ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి.. శనివారం మధ్యాహ్నం వరకు 1 గంట వరకు నమోదైన కోవిడ్19 పరీక్షల్లో.. మరో 21 కేసులు బయటపడ్డాయి. వీటిలో గుంటూరు 14, కర్నూలు 5.. ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తాజా బులిటెన్లో ప్రకటించారు. ఈ 21 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 402కు పెరిగింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 11మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.రాష్ట్రంలో కేసుల్లో కర్నూలు జిల్లా టాప్లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.
జిల్లాలవారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలు జిల్లా - 82
గుంటూరు జిల్లా - 72
నెల్లూరు జిల్లా - 48
ప్రకాశం జిల్లా - 41
కృష్ణా జిల్లా -35
కడప జిల్లా - 30
పశ్చిమ గోదావరి జిల్లా - 22
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా - 20
తూర్పుగోదావరి జిల్లా - 17
అనంతపురం జిల్లా -15
మొత్తం కేసులు -402
(గమనిక: ఈ మొత్త కరోనా పాజిటివ్ కేసుల్లో 11మందికి ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు)